గర్భవతుల వాంతులు, వికారం | |||||||
>
ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను నమిలి మింగినా, ఒక కప్పు నీటిలో అల్లం ముక్క వేసి
టీలా కాచి వేడిగా త్రాగినా వాంతులు నెమ్మదిస్తాయి. |
|||||||
> పది
చుక్కలు నిమ్మరసం, అర స్పూన్ పంచదార, ఒక కప్పు నీటిలో కలపాలి. పావు స్పూన్
బేకింగ్ సోడా కలిపి వెంటనే త్రాగితే వాంతులు,వికారం పోతాయి. |
|||||||
> రెండు యాలకి కాయలను నమిలి రసం మింగుతూ ఉంటే వికారం, వాంతులుతగ్గిపోతాయి. | |||||||
> రాత్రిపూట ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి మరుచటి రోజు ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే వేవిళ్ళు తగ్గుతాయి. | |||||||
> ఉదయాన్నే మాదీఫలరసాయనం రెండు స్పూన్లు, నీళ్ళు కలిపి త్రాగితే వేవిళ్ళు పూర్తిగా తగ్గుతాయి. | |||||||
బాలింతల క్షీరవృద్ధికి | |||||||
> తమ ఆహారంలో క్యాబేజీని తరఛుగా తీసుకుంటే పాలిచ్చే తల్లులకు క్షీర వృద్ధి కలుగుతుంది. | |||||||
> వామును కషాయం కాచి, రోజుకొకసారి ఒక ఔన్స్ మోతాదు త్రాగితే చనుబాలు పెరుగుతాయి. | |||||||
> లవంగ చూర్ణంలో కొద్దిగా ఇంగువ పొడి కలిపి రెండు పూటలు తీసుకుంటే పాలు వృద్ధి అవుతాయి. | |||||||
> బార్లీ గింజలు 5 గ్రాములు, పావు లీటరు పాలలో మెత్తగా ఉడికించి పంచదార చేర్చి త్రాగిన క్షీరవృద్ది. | |||||||
> దోరగా ఉన్న బొప్పాయి కాయను కూర వండుకుని తింటే చనుబాలు వృద్ది అవుతాయి. | |||||||
రక్తలేమి | |||||||
> ప్రతిరోజు రెండు పూటలా తేనె ఒక స్పూన్ తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. | |||||||
> ప్రతిరోజు రెండు పూటలా పొదిన ఆకుల రసం మూడు స్పూన్లు తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. | |||||||
> మునగాను తరచుగా వాడితే చక్కని రక్తం పడుతుంది. యవ్వనవంతులుగా ఉంచుతుంది.(గర్భిణీలు వాడరాదు) | |||||||
> పాలకూరను ఆహారంగా తరచు వాడితే హిమోగ్లోబిన్, రక్తము వృద్ది చెందుతాయి. | |||||||
కడుపు ఉబ్బరం, మంట | |||||||
> ఒక గ్లాస్ వేడినీటిలో ఒక నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు వేసి, కలిపి త్రాగితే ఉబ్బరం తగ్గిపోతుంది. | |||||||
> ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ ధనియాలపొడి కలిపి త్రాగితే కడుపులో మంట తగ్గుతుంది. | |||||||
> ఒక చిన్న అల్లం ముక్కను నమిలి రసం మింగిన కడుపులో మంట తగ్గుతుంది. | |||||||
> చల్లటి పాలు ఒక గ్లాస్ తాగితే కడుపులో మంట, ఎసిడిటీ తగ్గిపోతాయి. | |||||||
> ధనియాలు
1పాలు, గసాలు 1పాలు, పంచదార 2పాళ్ళు, కలిపి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణం రెండు పూటలా ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి త్రాగితే, తలనొప్పి,తలతిరగటం పోతాయి. |
|||||||
> చిన్న అల్లము ముక్కను ఉప్పులో అద్ది, ప్రతిరోజు పరగడుపున తింటుంటే తలతిప్పు వ్యాధి తగ్గిపోతుంది. | |||||||
> ఒక
చిటికెడు కరివేపాకు చూర్ణం తేనెతో కలిపి పరగడుపున తీసుకుంటే పైత్య సంబందమైన వికారం, తలతిప్పు తగ్గుతాయి. |
|||||||
> టొమాటో,
బీట్ రూట్, క్యారట్, ఆరెంజ్, జ్యూసులు సమంగా కలిపి ఒక ఔన్స్ మోతాదు ప్రతిరోజు
ఉదయం తీసుకుంటే మీ శరీరఛాయ పెరుగుతుంది. |
|||||||
>
ప్రతిరోజూ అర స్పూన్ మెంతులపోడిని తీసుకుంటే, ప్రసవానంతరం గర్భాశయాన్ని
యదాస్థితికి తెస్తుంది. పొట్టను తగ్గిస్తుంది. |
|||||||
> చిన్న ఇంగువ ముక్కను రోజూ తీసుకున్న గర్భాశయాన్ని, పొట్టను పూర్వస్థితికితెస్తుంది. | |||||||
>
జీలకర్రను నేతిలో వేయించి తగినంత ఉప్పు కలిపి రెండుపూటలా అన్నము లేదా మజ్జిగతో చిటికెడు తింటే జీర్ణాశయ రోగాలు రావు. |
|||||||
> వాము కషాయాన్ని తేనెతో రోజూ బాలింతలకు ఇస్తే గర్భాశయం కృశించుకుంటుంది. పాలు బాగా పడతాయి. | |||||||
> స్నానానికి అరగంట ముందు, పసుపు కలిపిన కొబ్బరినూనె రాసినట్లయితే, చీరె కట్టిన చోట నల్లమచ్చలు పోతాయి. | |||||||
> నీరుల్లిపాయను, క్యారట్ ను, గుండ్రంగా తరిగి, రోజూ తింటుంటే మీ స్వరం మధురంగా మారుతుంది. | |||||||
> ఒక
స్పూన్ వేప ఆకులపొడిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే శరీరం నుండి దుర్గంధం
రానివ్వదు. చెమటను, చమటపొక్కులను, రానివ్వదు. |
|||||||
> నీళ్ళ
విరేచనాలు అవుతున్నప్పుడు, గసగసాలు, పంచదార ఒక్కొక్క స్పూన్ కలిపి మూడుపూటలు
తింటే కట్టుకుంటాయి. |
|||||||
> బెల్లం, జీలకర్ర సమంగా కలిపి నూరి, బటాణీగింజలంత గోలీలు చేసి మూడుపూటలా చప్పరిస్తే ఆకలిలేమి తగ్గుతుంది. | |||||||
> కొతిమెర
ఆకులతో టీ కాచి త్రాగినా, చెట్నీగా చేసుకుని తిన్నా, కండరాలు ముణగాలాగుకపొయ్యే
వ్యాది (Cramps) నివారణ అవుతుంది. |
|||||||
> Sore Throat: చిటికెడు ఉప్పు, రెండు చిటికెలు పసుపు వేసి కాచిన నీటితో రెండు పూటలా పుక్కిలించి ఉయ్యాలి. | |||||||
> ఒక కప్పు పాలలో పావు స్పూన్ పసుపు వేసి కాచి, వేడిగా త్రాగితే గొంతువాపు తగ్గుతుంది. | |||||||
> 5ml. తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి మూడు పూటలా త్రాగుతుంటే గొంతు వాపు, నొప్పి తగ్గుతాయి. | |||||||
> ప్రతిరోజు ఉదయం దాల్చిన చెక్కను 3గ్రాముల మోతాదులో నమిలి తినుచుండిన మతిమరుపు తొలగిపోవును. | |||||||
> మూడు పూటలు ఒక గ్లాస్ మజ్జిగ చొప్పున త్రాగుచుండిన రక్త విరేచనాలు తగ్గిపోవును. | |||||||
> అరికాళ్ళ మంటలు, తిమ్ముర్లు, నొప్పులు: నువ్వులనూనెను అరికాళ్ళకు బాగా మర్ధనచేస్తే తగ్గుతాయి. | |||||||
> అల్లంరసంలో తేనె కలుపుకుని ఒక స్పూన్ మోతాదు త్రాగుతుంటే జలుబు, దగ్గు, కళ్ళేపడటం తగ్గుతాయి. | |||||||
13, జులై 2018, శుక్రవారం
Health Tips - 1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి